బొగ్గు సైకిల్‌ను తోసిన రాహుల్: జోడో న్యాయ్ యాత్రలో ఆసక్తికర పరిణామం

by Dishanational2 |
బొగ్గు సైకిల్‌ను తోసిన రాహుల్: జోడో న్యాయ్ యాత్రలో ఆసక్తికర పరిణామం
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో న్యాయ్ యాత్రలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో యాత్ర కొనసాగుతుండగా రోడ్డుపై కార్మికులు తమ సైకిళ్లపై 200 నుంచి 250 కిలోల బరువున్న బొగ్గును తీసుకెళ్లడం చూశారు. దీనిని గమనించిన రాహుల్ వారి వద్దకు వెళ్లాడు. వారితో ముచ్చటించిన అనంతరం.. బొగ్గు సైకిల్‌ను తోసేందుకు ప్రయత్నించారు. ఈ పోటోలను కాంగ్రెస్ ఎక్స్‌లో షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘భారతదేశాన్ని నిర్మించడంలో నిమగ్నమైన కార్మికులు తమ కష్టానికి సమానమైన ప్రతిఫలం పొందాలి. వారికి న్యాయం జరగాలి.. ఇదే జోడో న్యాయ్ యాత్ర లక్ష్యం’ అని కాంగ్రెస్ పేర్కొంది. కాగా, జోడో న్యాయ్ రాష్ట్రంలోని 13 జిల్లాలను కవర్ చేస్తూ 804 కిలోమీటర్ల మేర సాగనుంది.



Next Story

Most Viewed