యూకేలో రాహుల్ గాంధీ భారత్‌ను అవమానించారు.. క్షమాపణ చెప్పాల్సిందే: రక్షణ మంత్రి

by Disha Web Desk 12 |
యూకేలో రాహుల్ గాంధీ భారత్‌ను అవమానించారు.. క్షమాపణ చెప్పాల్సిందే: రక్షణ మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ రెండో విడత సభలు ఈ రోజు తిరిగి ప్రారంభం అయ్యాయి. సభలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ లండన్‌లో భారత్‌ను అవమానించారని, ఆయన వ్యాఖ్యలను లోక్‌సభ సభ్యులందరూ ఖండించాలని అన్నారు. అలాగే రాహుల్ గాంధీ సభ ముందు క్షమాపణలు చెప్పాలని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

కాగా రాహుల్ గాంధీ ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అదే సమయంలో విపక్షాలు సభలో ఆందోళన చేయడంతో సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. కాగా రాహుల్ గాంధీ చాథమ్ హౌస్ చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రజాస్వామ్యం పై "దాడి చేయబడుతోంది.. బెదిరింపులకు గురవుతోంది" అని అన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed