వాజ్ పేయికి రాహుల్ గాంధీ నివాళి

by Dishafeatures2 |
వాజ్ పేయికి రాహుల్ గాంధీ నివాళి
X

దిశ, వెబ్ డెస్క్: ఆదివారం అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన జయంతి వేడుకలను బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అటల్ బిహారీ వాజ్ పేయ్ కు ఘన నివాళి అర్పించారు. సదైవ్ అటల్ లోని వాజ్ పేయి సమాధి వద్ద పూలమాల ఉంచి రాహుల్ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వాజ్ పేయి సేవలను రాహుల్ గాంధీ కొనియాడారు. అదే విధంగా ఢిల్లీలోని విజయ్ ఘాట్ వద్ద మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి కూడా రాహుల్ నివాళులు అర్పించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఢిల్లీలో కొనసాగుతోంది.

Also Read...

'యుద్ధం జరిగితే చైనా, పాక్ కలిసి వస్తాయి.. సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ప్రిపేర్'



Next Story