మోడీజీ.. ఇది మీ పట్టాభిషేకం కాదు: రాహుల్ గాంధీ

by Disha Web Desk 2 |
మోడీజీ.. ఇది మీ పట్టాభిషేకం కాదు: రాహుల్ గాంధీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ రాజులా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని ప్రధాని తన పట్టాభిషేకంగా భావిస్తున్నారని ఆదివారం ట్వీట్ చేశారు. పార్లమెంట్ అంటే ప్రజల గొంతుక అన్నారు. కానీ మోడీ తీరు అందుకు భిన్నంగా ఉందని మండిపడ్డారు. ఆదివారం నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సహా 21 విపక్ష పార్టీలు బహిష్కరించాయి. విపక్షాల తీరుపై బీజేపీ సైతం ఎదురుదాడికి దిగింది.

Next Story

Most Viewed