రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న పుతిన్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-05 06:32:24  IST  )

ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ద్రౌపతి ముర్ము, ప్రధాని మోడీ ఆయనకు ఘనస్వాగతం పలికారు.

రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న పుతిన్
X

దిశ‌, వెబ్ డెస్క్: ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ద్రౌపతి ముర్ము, ప్రధాని మోడీ ఆయనకు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు గౌరవ వందనంతో సైనికులు వెల్ కమ్ చెప్పారు. ఇదిలా ఉంటే పుతిన్ నాలుగేళ్ల తరవాత మళ్లీ ఇండియాకు అధికారిక పర్యటనకోసం వచ్చారు. ఈ పర్యటనలో భారత్‌తో రష్యా కొన్నిఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. భారత్ పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో పుతిన్ పర్యటన సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

ఈ పర్యటన ఇండియా రష్యా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. ఇక ఇండియాలో అడుగుపెట్టే ముందు ఓ ఇంటర్వ్యూలో పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సుంకాలకు మోడీ లొంగిపోయే వ్యక్తి కాదన్నారు. రష్యా నుండి ఇండియా ఇంధనం కొనుగోలు చేస్తే ట్రంప్ సుంకాలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా రష్యా నుండి అణుఇంధనాన్ని కొనుగోలు చేస్తుందని మరి భారత్ ఎందుకు కొనుగోలు చేయవద్దని ప్రశ్నించారు. ఇక గురువారం పుతిన్ ఇండియాకు రాగా రెండు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు.

Next Story