ఇండోర్ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

by Disha Web Desk 2 |
ఇండోర్ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్ ఇండోర్‌లో శ్రీరామనవమి సందర్భంగా చోటు చేసుకున్న మెట్ల బావి ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలోచ మొత్తం ఐదుగురు భక్తులు చనిపోగా మరో 15 మందిని రెస్క్యూ టీమ్ కాపాడింది. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇది చాలా బాధకరమైన దుర్ఘటన అన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చహాన్ తో మాట్లాడినట్లు ప్రధాని ట్వీట్ చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించినట్లు తెలిపారు.


Next Story

Most Viewed