ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ పెంచుతున్న మోడీ వరుస టూర్లు

by Disha Web Desk 2 |
ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ పెంచుతున్న మోడీ వరుస టూర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బృహన్‌ ముంబై మునిసిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగాల్సిన వేళ ప్రధాని నరేంద్ర మోడీ వరుస పర్యటనలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి. శుక్రవారం ఆ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ నుంచి ఈ ట్రైన్స్‌ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అంధేరి సబర్బన్‌లోని మరోల్‌లో దావూదీ బోహ్రా కమ్యూనిటీకి చెందిన ప్రధాన విద్యా సంస్థ అల్జామియా-తుస్-సైఫియా (ది సైఫీ అకాడమీ) కొత్త క్యాంపస్‌‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. కమ్యూనిటీ అధినేత సయ్యద్నా సాహబ్ కుటుంబానికి చెందిన నాలుగు తరాలతో నాకు అనుబంధం ఉందన్నారు. తాను ఇక్కడ ప్రధానమంత్రిగా రాలేదని ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చానన్నారు. తనలాంటి అదృష్టం అరుదుగా చాలా కొద్ది మందికే లభిస్తుందన్నారు. కాగా ముంబైలోని అత్యంత ప్రభావవంతమైన కమ్యూనిటీలలో దావూదీ బోహ్రా ముస్లిం కమ్యునిటీ ఒకటి. త్వరలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ మోడీ టూర్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. నెల రోజులు గడవక ముందే మోడీకి మహారాష్ట్రలో ఇది రెండో పర్యటన విశేషం.

Also Read..

అదానీ షేర్ల పతనంపై వివరాలు తెలపండి: సుప్రీంకోర్టు


Next Story

Most Viewed