సీవీసీ‌గా ప్రవీణ్ శ్రీవాస్తవ ప్రమాణ స్వీకారం.. పాల్గొన్న ప్రధాని మోడీ

by Disha Web Desk 9 |
సీవీసీ‌గా ప్రవీణ్ శ్రీవాస్తవ ప్రమాణ స్వీకారం.. పాల్గొన్న ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ.. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ‌ను నూతన సీవీసీగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. కాగా ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటులు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ కూడా పాల్గోన్నారు. కాగా గత సంవత్సరం డిసెంబర్ నుంచి తాత్కాలిక సీవీసీ గా పనిచేస్తున్న శ్రీవాస్తవ నేటితో పూర్తిస్థాయి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా భాద్యతలు నిర్వహించనున్నారు.



Next Story

Most Viewed