Droupadi Murmu: ఎన్నో కఠిన సవాళ్లను అధిగమించాం

by Gantepaka Srikanth |

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) 79వ స్వాతంత్ర్య దినోత్సవ(Independence Day) శుభాకాంక్షలు తెలియజేశారు.

Droupadi Murmu: ఎన్నో కఠిన సవాళ్లను అధిగమించాం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) 79వ స్వాతంత్ర్య దినోత్సవ(Independence Day) శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలకు అందుతున్నాయని అన్నారు. స్వాతంత్ర్య ఫలాలు ప్రజలంతా అనుభవిస్తున్నారని తెలిపారు. మన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శం. భారత ప్రజాస్వామ్యం ఎన్నో కఠిన సవాళ్లను అధిగమించింది. విద్య, వైద్య రంగాల్లో దేశం ఉన్న స్థాయికి చేరుకుంటోంది. 55 కోట్ల మందికి ఆరోగ్య బీమా అందిస్తున్నాం. మన జీవితాల్లో ఏఐ అంతర్భాగమైంది. 2047 నాటికి ఏఐ గ్లోబల్ హబ్‌గా ఇండియా మారబోతోంది అని ముర్ము ప్రసంగంలో పేర్కొన్నారు.

Next Story