ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు భారీగా పోలీసుల మోహరింపు

by Dishafeatures2 |
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు భారీగా పోలీసుల మోహరింపు
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు (ఏప్రిల్ 16) విచారణకు హాజరు కావాలంటూ కేజ్రీవాల్ కు సీబీఐ ఉత్వర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. ఇక ఈ రోజు సీబీఐ విచారణకు హాజరుకానున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ క్రమంలోనే ఆయనతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా సీబీఐ కార్యాలయానికి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా ఈ కేసులో ఇప్పిటికే ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను పోలీసులు అరెస్ట్ చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed