ప్రధాని శాంతిని పునరుద్ధరించాలి.. మణిపూర్ హింసపై రాహుల్

by Disha Web Desk 12 |
ప్రధాని శాంతిని పునరుద్ధరించాలి.. మణిపూర్ హింసపై రాహుల్
X

దిశ, వెబ్‌డెస్క్: మణిపూర్‌లో చేలరేగిన హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. రాహుల్ మాట్లాడుతూ.. "మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్థితి వేగంగా క్షీణించడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాను" అని అన్నారు. "ప్రధానమంత్రి శాంతి, సాధారణ స్థితిని పునరుద్ధరించడం పై దృష్టి పెట్టాలి. మణిపూర్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని నేను కోరుతున్నాను" అని గాంధీ ట్విట్టర్‌లో రాహుల్ గాంధీ రాసుకొచ్చాడు. కాకా ప్రస్తుతం మణిపూర్‌లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు.. ఆర్మీ, మణిపూర్ స్సెషల్ పోలీసులు రంగంలోకి దిగారు. అలాగే ఆ రాష్ట్ర గవర్నర్.. అల్లర్లు సృష్టిస్తున్న వారు కనిపిస్తే కాల్చి వేయండని ఆర్డర్ జారీ చేశారు.



Next Story