- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. పీఎం-సేతు పథకం ప్రారంభం
పీఎం-సేతు పథకాన్ని(PM-SETU Scheme) ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో శనివారం ప్రధాని మోడీ(PM Modi) లాంఛనంగా ప్రారంభించారు.

దిశ, వెబ్డెస్క్: పీఎం-సేతు పథకాన్ని(PM-SETU Scheme) ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో శనివారం ప్రధాని మోడీ(PM Modi) లాంఛనంగా ప్రారంభించారు. దేశ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు రూ.62,000 కోట్లకు పైగా ఖర్చు చేసే అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇది 6,500 మంది విద్యార్థులకు స్థలం కల్పించే అత్యాధునిక విద్యా కేంద్రం. ఇక్కడ 5G యూస్ కేస్ ల్యాబ్, ISROతో కలిసి రీజియనల్ అకడమిక్ సెంటర్ ఫర్ స్పేస్, ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యుబేషన్ సెంటర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఇన్క్యుబేషన్ సెంటర్ ఇప్పటికే 9 స్టార్టప్లకు మద్దతు ఇచ్చింది. ఈ క్యాంపస్... బిహార్లో టెక్నాలజీ, రీసెర్చ్కు కొత్త ఊరట ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. పాట్నా నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్యాంపస్.. భవిష్యత్ ఇంజినీరింగ్ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందిస్తుంది. ముఖ్యంగా యువత విద్యా, నైపున్యాభివృద్ధికి ఈ పథకం తోడ్పడనుందని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. బిహార్లోని 19 జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బిహార్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని అన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల బిహార్ యువతకు ఈసారి డబుల్ బొనాంజ వచ్చిందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్, ఉపాధి అవకాశాలు దక్కాలంటే నైపుణ్యాలు కావాలని చెప్పారు.






