ఇంధనం, భద్రతపై కీలక ఒప్పందాలు

by Disha Web Desk 12 |
ఇంధనం, భద్రతపై కీలక ఒప్పందాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఇవాళ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు జరపుతున్నారు. ఫిబ్రవరి 2019 తర్వాత సౌదీ ప్రిన్స్ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా ఇంధనం, వ్యవసాయం సహా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి. జీ 20 సమ్మిట్ కోసం ఈ నెల 8న ప్రిన్స్ ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల కోసం ఆయన ఒక రోజు కార్యక్రమాన్ని పొడిగించారు. ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా వివిధ దేశాలతో సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకోవడం తో పాటు రాజకీయ, భద్రత, రక్షణ, తదితర అంశాలతో పాటు పలు అంశాలపై చర్చ సాగనుంది.

Next Story

Most Viewed