- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భోపాల్లో ప్రధాని పర్యటన.. ఘాట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
by Naga Rani Yarlagadda |
ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) నేడు భోపాల్లో పర్యటించనున్నారు. లోకమాత దేవీ అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా భోపాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.

X
దిశ, వెబ్డెస్క్: ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) నేడు భోపాల్లో పర్యటించనున్నారు. లోకమాత దేవీ అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా భోపాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. క్షిప్రానది (Kshipra River)పై రూ.860 కోట్ల వ్యయంతో తలపెట్టిన ఘాట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జంబోరి గ్రౌండ్ (Jambori Ground)లో మహిళా సాధికారత మహాసదస్సుకు హాజరై.. బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే మహిళలు సింధూర రంగు చీర ధరించాలని విజ్ఞప్తి చేశారు. లోకమాతదేవీ అహల్యాబాయి పోస్టల్ స్టాంపును, రూ.300 ప్రత్యేక నాణెం విడుదల చేయనున్నారు. ఈ పర్యటనలో ఇండోర్ మెట్రో, దాతియా - సత్నా ఎయిర్ పోర్టును వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఉజ్జయినిలో 29 కిలోమీటర్ల పొడవైన ఘాట్ కు వర్చువల్ భూమిపూజ చేస్తారు.
Next Story






