నేడు చెన్నైకు ప్రధాని.. కొత్త ఎయిర్‌పోర్టు, వందే భారత్ ట్రైన్ ప్రారంభం

by Disha Web Desk 17 |
నేడు చెన్నైకు ప్రధాని.. కొత్త ఎయిర్‌పోర్టు, వందే భారత్ ట్రైన్ ప్రారంభం
X

చెన్నై: దక్షిణాది పర్యటనలో భాగంగా తమిళనాడులో ప్రధాని పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చెన్నైలో రూ. 2,437 కోట్లతో నిర్మించిన కొత్త ఎయిర్ పోర్టును ఆయన శనివారం ప్రారంభించనున్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర రాజధానిలో భద్రతను పటిష్టం చేశారు. పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ లను ఏర్పాటు చేశారు. కాగా, ఎయిర్‌పోర్టులోని తొలి దశ టెర్మినల్ ద్వారా ఏటా 35 మిలియన్ల ప్రయాణీకుల రాకపోకలు సాగిస్తారని అంచనా వేస్తున్నారు.

దీంతో పాటు చెన్నై టూ కొయంబత్తూర్ మధ్య నడవనున్న వందే భారత్ ట్రైన్‌ను మోడీ ప్రారంభించనున్నారు. దీని ద్వారా దాదాపు గంటన్నర సమయం కలిసి రానున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. ఆ తర్వాత ప్రధాని పల్లవరంలో మౌళిక నిర్మాణాల ప్రారంభోత్సవం, వివేకానందర్ ఇల్లాంలోని రామకృష్ణ మఠ్ 125వ వార్షిక దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.



Next Story

Most Viewed