- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PM Modi: రేపు థాయిలాండ్ పర్యటనకు ప్రధాని మోడీ.. కీలక సమావేశానికి హాజరు
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం థాయిలాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) గురువారం థాయిలాండ్ (Thailand) టూర్కు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్న మోడీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. థాయ్ ప్రధాని షేటోంగ్ టార్న్ షినవత్రాతో భేటీ అయ్యి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అంతేగాక బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (BIMSTEC) ఆరో శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది. అలాగే కూటమి సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్చించే చాన్స్ ఉందని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
ఈ సమ్మిట్కు థాయ్ పీఎం పేటోంగ్టార్న్ షినవత్రా, నేపాల్ ప్రధాని కేపీ ఓలి (Kp oli), భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే (Shering tobge), బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Mohammad yunus), శ్రీలంక పీఎం హరిణి అమరసూర్య (Amara surya)లు సైతం హాజరుకానున్నారు. 2018లో నేపాల్లోని ఖాట్మండులో జరిగిన నాలుగో బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం తర్వాత మొదటి భౌతిక సమావేశం ఇదే కావడం గమనార్హం. చివరి శిఖరాగ్ర సమావేశం 2022 మార్చిలో కొలంబోలో వర్చువల్ ఫార్మాట్లో జరిగింది. ప్రధాని మోడీ పర్యటన పట్ల థాయిలాండ్లోని భారత రాయబారి నగేష్ సింగ్ స్పందించారు. మోడీ పర్యటన నేపథ్యంలో థాయిలాండ్లో ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొందన్నారు.






