నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాక్‌కు చూపించాం: మోడీ

by Ajay Maddhiboyina |

ప్ర‌ధాని మోడీ ప్ర‌స్తుతం గుజ‌రాత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దాహోద్ సభలో ఆపరేషన్ సిందూర్ ‌గురించి మరోసారి ఆయన మాట్లాడారు.

నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాక్‌కు చూపించాం: మోడీ
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌ధాని మోడీ ప్ర‌స్తుతం గుజ‌రాత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దాహోద్ సభలో ఆపరేషన్ సిందూర్ ‌గురించి మరోసారి ఆయన మాట్లాడారు. 11 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రధానిగా పగ్గాలు చేపట్టామని అన్నారు. మన మహిళల సిందూరం తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశామని అన్నారు. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పారు. మోడీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు చూపించామని అన్నారు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షను నెరవేర్చామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ భారతీయుల భావాలకు ప్రతీక అని అన్నారు. అది కేవలం సైనిక చర్య మాత్రమే కాదని చెప్పారు. 140 కోట్ల భారతీయులకు ఉగ్రవాదులు సవాలు విసిరారని అన్నారు.

Next Story