Earthquake In Turkey: భయంతో పరుగులు తీసిన జనం

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-15 14:37:25  IST  )

తుర్కియే((Turkey)) దేశంలో భూకంపం సంభవించింది.

Earthquake In Turkey:  భయంతో పరుగులు తీసిన జనం
X

దిశ,వెబ్‌డెస్క్: తుర్కియే((Turkey)) దేశంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు(Richter scale)పై తీవ్రత 5.2గా నమోదైంది. ఆ దేశ అత్యవసర నిర్వహణ సంస్థ (ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ) వెల్లడించింది. ఈ భూకంపం(Earthquake) కారణంగా ఇస్తాంబుల్‌లో బలమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఇళ్లలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు. భూమి కంపించిన సమయంలో ప్రాణ భయంతో ప్రజలంతా రోడ్ల మీదకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో రహదారుల్లో వెళుతున్న కార్లు భూకంప తీవ్రతకు ఊగిపోయాయి. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. అయితే.. భూకంపానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్నాయి.

Next Story