- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పశ్చిమాసియాలో పరిస్థితి తీవ్ర ఆందోళనకరం : శాంతిమార్గమే శరణ్యమన్న మోదీ
పశ్చిమ ఆసియాలో నెలకొన్ని యుద్ధ పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం దేనికీ పరిష్కారమార్గం కాదన్నారు.

దిశ, వెబ్డెస్క్: పశ్చిమ ఆసియాలో పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయని, శాంతి చర్చలు జరపడమే ఇందుకు మంచిమార్గమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఇందుకు భారత్ ఎప్పుడూ మద్దతిస్తుందని పేర్కొన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంపై ఆయన హైదరాబాద్ హౌస్ లో కెనడా ప్రధానితో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో స్పందించారు. రెండు ప్రజాస్వామ్య దేశాలు ఏకమైనప్పుడు, శాంతి కోసం వినిపించే ఆ గొంతు మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం దేనికీ పరిష్కారం కాదని, అన్ని వివాదాలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ కోరుకుంటోందని మోదీ పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయ పౌరుల రక్షణ, భద్రతను నిర్ధారించడానికి భారత్ అన్ని దేశాలతో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వేదికలపై శాంతి స్థాపన కోసం భారత్ తన గళాన్ని ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుందన్నారు.
శనివారం (ఫిబ్రవరి 28)న ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సైనిక చర్యలను ప్రకటించినప్పటి నుండి ఇరాన్ సహా పలు దేశాలపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.






