- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సీజ్ఫైర్ ఉల్లంఘన తర్వాత చైనా విదేశాంగ మంత్రికి దోవల్ కాల్..!

X
దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ క్రమంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీకి ఫోన్ చేసి మాట్లాడారు. పెహల్గాం ఉగ్రదాడి వల్ల భారత్లో చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, దీంతో టెర్రరిస్టులకు వ్యతిరేకంగా భారత్ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని, అందుకే ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు స్పష్టంచేశారు. అలాగే భారత్ యుద్ధం కోరుకోలేదని తెలిపారు.
అయితే రెండు దేశాలు కొంత నెమ్మదించి, పరిస్థితులు చక్కబడతాయని తాము ఆశించినట్లు వాంగ్ యీ చెప్పారట. సమస్యను మరింత పెంచకుండా విభేదాలను మాటలతో పరిష్కరించుకుంటే బాగుంటుందని అన్నారట. కాగా, భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడాన్ని చైనా కూడా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
Next Story