భారతే ఆత్మాహుతి దాడి చేయించిందన్న పాక్.. తీవ్రంగా ఖండించిన భారత్

by Phanindra |

తమ ఆర్మీపై జరిగిన ఆత్మాహుతి దాడిని భారతే చేయించిందని పాక్ ఆరోపించింది. వీటిని భారత్ తీవ్రంగా ఖండించింది.

భారతే ఆత్మాహుతి దాడి చేయించిందన్న పాక్.. తీవ్రంగా ఖండించిన భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ ఆర్మీపై జరిగిన ఆత్మాహుతి దాడి భారతే చేయించిందని దాయాది దేశం సంచలన ఆరోపణలు చేసింది. ఉత్తర వాజిరిస్తాన్‌లో జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 13 మంది పాక్ జవాన్లు దుర్మరణం పాలవగా.. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి భారత్ చేయించిందని పాక్ ఆరోపణలు చేయగా.. ఈ వాదనలను భారత్ తీవ్రంగా ఖండించింది.

‘వాజిరిస్తాన్‌లో జరిగిన దాడికి భారత్‌ను బ్లేమ్ చేసేందుకు ప్రయత్నించినట్లు పాక్ ఆర్మీ చేసిన ప్రకటనను మేం చూశాం. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని భారత విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. కాగా, ఈ దాడి తామే చేసినట్లు హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ప్రకటించింది. ఇది తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)తో సంబంధాలు కలిగి ఉన్న సంస్థ కావడం గమనార్హం.

Next Story