- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పాక్ ఆర్మీ చీఫ్కు మరింత బలం.. ప్రజలపై మిలటరీ చట్టాల వినియోగానికి సుప్రీంకోర్టు ఓకే!

దిశ, నేషనల్ బ్యూరో: భారత్తో యుద్ధం కోరుకుంటున్న పాక్ ఆర్మీ జనరల్ ఆసిమ్ మునీర్కు పాకిస్తాన్ సుప్రీంకోర్టు మరింత బలం చేకూర్చింది. సాధారణ ప్రజలపై కూడా మిలటరీ చట్టాల ప్రకారం, మిలటరీ కోర్టుల్లో విచారణ జరపవచ్చంటూ సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో స్వదేశంలో తనకు ఎదురు తిరిగిన వారిపై మునీర్ కొరడా ఝుళిపించడం ఖాయమని పాక్ ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
2023 అల్లర్ల కేసులో..
2023లో అప్పటి పాక్ ప్రధాని, పాకిస్తాన్ టెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వేలాదిమంది పీటీఐ కార్యకర్తలు ఆర్మీపై మండిపడ్డారు. ఇమ్రాన్ను మునీరే కుట్రపన్ని అరెస్టు చేశాడనే ఆరోపణలతో మిలటరీ స్థావరాలపై దాడిచేశారు. వీరిపై కేసులు పెట్టిన ఆర్మీ.. మిలటరీ చట్టాల ప్రకారం వీరందరిపై చర్యలు తీసుకోవాలని అనుకుంది. అయితే ఇది సివిల్ సమస్య అని, దాన్ని మిలటరీ కోర్టులకు అప్పగించలేమని అప్పట్లో పాకిస్తాన్ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఫుల్ పవర్..
జస్టిస్ అమినుద్దీన్ ఖాన్ నేతృత్వంలోని ఏడుగురు జడ్జిల బెంచ్ ముందుఈ తీర్పును ఆర్మీ సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. 2023 మే 9న నిరసనల్లో పాల్గొన్న ప్రజలపై మిలటరీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడానికి, వారిపై మిలటరీ కోర్టులో విచారణ జరపడానికి అంగీకరిస్తూ 5-2 ఓటింగ్తో అనుమతించింది. అయితే స్వదేశంలో తనకు ఎవరూ ఎదురు చెప్పకుండా మునీర్ ఈ తీర్పును దుర్వినియోగం చేస్తాడని పీటీఐ వర్గాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే ఆర్మీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని పోలీసులు టార్గెట్ చేస్తున్నారని, ఈ తీర్పుతో పరిస్థితి మరింద దారుణంగా మారుతుందని పలువురు విశ్లేషకులు కూడా హెచ్చరిస్తున్నారు.