- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pakisthan: పాక్కు వరద అలర్ట్.. తావి నది పరిస్థితిని తెలియజేసిన భారత్
సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. తావి నది వరద పరిస్థితిపై భారత్ సమాచారం తెలియజేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్కు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లోని తావి నది వరద పరిస్థితిపై భారత్ పాకిస్థాన్కు సమాచారం తెలియజేసింది. ఈ నది నుంచి భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ విషయాన్ని ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమాచారం అందించింది. దీంతో ఇండియా సమాచారం ఇచ్చిన తర్వాత పాక్ సైతం అప్రమత్తమైనట్టు పలు కథనాలు పేర్కొన్నాయి. హైకమిషన్ ద్వారా ఈ తరహా ఇన్ఫర్మేషన్ పంచుకోవడం ఇదే తొలిసారి. సాధారణంగా ఇటువంటి సమాచారాన్ని సింధూ జలాల ఒప్పందం ప్రకారం ఇరు దేశాల కమిషనర్లు షేర్ చేసుకునే వారు. కానీ పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ అగ్రిమెంట్ను రద్దు చేసింది. ఈ క్రమంలోనే వరద పరిస్థితిపై పాక్ ను అలర్ట్ చేయడం గమనార్హం. అయితే మానవతా ధృక్పదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని విదేశాంగ శాఖ తెలిపింది.






