దేశ రాజధానిలో ఈ-రిక్షా పేలి వ్యక్తి మృతి

by Dishanational1 |
దేశ రాజధానిలో ఈ-రిక్షా పేలి వ్యక్తి మృతి
X

న్యూఢిల్లీ: దేశరాజధానిలో ఈ-రిక్షాలో పేలుడు కలకలం రేపింది. సోమవారం గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో కాస్తా ఆలస్యంగా బయటకు వచ్చింది. అయితే ఈ-రిక్షాలో క్రాకర్లు ఉండటమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రగాయాలతో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు. కేవలం సెకన్ల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. జగన్నాథ వేడుకల్లో క్రాకర్లను పేల్చేందుకు తరలిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story

Most Viewed