రోడ్డు తనిఖీ చేస్తుండగా బోల్తా పడ్డ లారీ.. భయంతో పరుగులు తీసిన అధికారులు(వీడియో)

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది.

రోడ్డు తనిఖీ చేస్తుండగా బోల్తా పడ్డ లారీ.. భయంతో పరుగులు తీసిన అధికారులు(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఖడ్కి గ్రామంలో కొత్తగా రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాణంలో ఉన్న రోడ్డును పరిశీలించేందుకు ఇంజనీర్ అధికారులు వచ్చారు. ఈ తరుణంలో ఇంజనీర్ బృందంకు పెను ప్రమాదం తప్పింది. వారు రోడ్డు తనిఖీ చేస్తున్న సమయంలో అటుగా వచ్చిన లారీ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనతో భయపడిన ఇంజనీర్ బృందం పరుగులు తీసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘నాసిరకమైన రోడ్డును నిర్మించారు’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ట్వీట్

Next Story