- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DK Shivakumar: ‘ఆపరేషన్ లోటస్’..ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల ఆఫర్ !
ఒడిశా రాష్ట్రంలో ఆపరేషన్ లోటస్ కు భారతీయ జనతా పార్టీ తెరలేపిందని షాకింగ్ కామెంట్స్ చేశారు డీకే శివకుమార్.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ( DK Shiva kumar) సంచలన ఆరోపణలు చేశారు. ఒడిశా రాష్ట్రంలో ఆపరేషన్ లోటస్ కు భారతీయ జనతా పార్టీ తెరలేపిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజ్యసభ ఎన్నికల హడావిడి ఉన్న నేపథ్యంలో డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు డీకే శివకుమార్. ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఐదు కోట్ల చొప్పున ఇచ్చేందుకు సిద్ధమయ్యారని కూడా సంచలన ఆరోపణలు చేశారు.
తమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గెలవాలని భారతీయ జనతా పార్టీ కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు. ఇది భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ లోటస్ లో భాగమని సీరియస్ అయ్యారు. క్రాస్ ఓటింగ్ చేయాలని నలుగురు వ్యక్తులు తమ ఎమ్మెల్యేలను కాంట్రాక్టు చేశారని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు కూడా చేసినట్లు వెల్లడించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు డీకే శివకుమార్. దీంతో డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ తరుణంలోనే ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులోని ఓ రిసార్టుకు కూడా అధిష్టానం తరలించినట్లు సమాచారం.






