ముగ్గురికి నోబెల్ పురస్కారం ప్రకటన

by Gantepaka Srikanth |

అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాలను(Nobel Prize) నిర్వహకులు ప్రకటించారు.

ముగ్గురికి నోబెల్ పురస్కారం ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాలను(Nobel Prize) నిర్వహకులు ప్రకటించారు. వైద్యశాస్త్రం(Medicine)లో ముగ్గురికి పురస్కాలు ప్రకటించారు. ఇద్దరు అమెరికన్లు, ఒక జపాన్ శాస్త్రవేత్తకు నోబెల్ వరించింది. మేరీ బ్రంకౌ, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమన్‌లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. రోగనిరోధక వ్యవస్థపై పరిశోధనలు చేయడమే గాకుండా.. విశేష సేవలు అందించినందుకు గాను వీరికి నోబెల్ అవార్డులు వచ్చాయి. కాగా, అక్టోబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రకటించనున్నారు. భౌతిక శాస్త్రం మొదలుకొని వివిధ విభాగాలలో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. సాహిత్యంలో నోబెల్ బహుమతిని అక్టోబర్ 9న స్టాక్‌హోమ్ నుంచి ప్రకటించనున్నారు. తరువాత 10వ తేదీన నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తారు.

Next Story