- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిమాచల్ సీఎం షాకింగ్ నిర్ణయం: ఎమ్మెల్యేలకు వీఐపీ సౌకర్యాలు బంద్
by Harish |
హిమాచల్ ప్రదేశ్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు కీలక నిర్ణయం తీసుకున్నారు.

X
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం పార్టీ శాసనసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలకు ప్రత్యేక సౌకర్యాలు ఏమి ఉండబోవని స్పష్టం చేశారు. శాసనసభ్యులు, అధికారులు సాధారణ పౌరుల వలె హిమాచల్ భవన్, హిమాచల్ సదన్లలో సేవలు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇవి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కూడా వర్తించనున్నట్లు తెలిపారు.
మరోవైపు త్వరలోనే రాష్ట్ర కేబినెట్ను విస్తరిస్తామని చెప్పారు. అంతేకాకుండా తమ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీ వన్ పెన్షన్ స్కీం పైన కూడా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పార్టీ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. కాగా, ఆదివారమే హిమాచల్ ప్రదేశ్ 15వ సీఎంగా సుఖ్వీందర్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
Next Story






