Himachal Pradesh నూతన సీఎం సుఖు కీలక వ్యాఖ్యలు

by Dishanational1 |
Himachal Pradesh నూతన సీఎం సుఖు కీలక వ్యాఖ్యలు
X

న్యూఢిల్లీ: హిమచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎలాంటి సవాళ్లు ఎదురవ్వలేదని చెప్పారు. దేశ రాజధానిలో రాష్ట్ర ప్రతిభా సింగ్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేతో సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ఇచ్చిన 10 హామీలను నేరవేర్చేందుకు కృషి చేస్తామని అన్నారు. వీటిలో ముందు పాత పెన్షన్ స్కీంను తిరిగి తీసుకురావడంపైనే దృష్టి పెట్టినట్లు చెప్పారు. ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ఎమ్మెల్యేలకు ప్రత్యేక సౌకర్యాలు తొలగిస్తున్నట్లు ప్రకటించారు. సాధారణ పౌరుల వలె ట్రీట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

Also Read...

నిజంగానే ఇది వింత కలిగించే విషయం...

Next Story

Most Viewed