గెలిస్తే బైక్‌పై ముగ్గురికి అనుమతిస్తాం: భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాశ్

by Web Desk |
గెలిస్తే బైక్‌పై ముగ్గురికి అనుమతిస్తాం: భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాశ్
X

లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) సారథ్యంలోని తమ కూటమి అధికారంలోకి వస్తే బైక్‌పై ముగ్గురు వెళ్లేందుకు అనుమతిస్తామని 'సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ' చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్‌భర్ హామీ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక ట్రైన్‌లో 70సీట్లపై 300మంది ప్రయాణిస్తే, ఆ రైలుకు చలాన్లు వేయరు. కానీ, బైక్‌పై ముగ్గురు వెళ్తేనే ఎందుకు వేస్తారు? కాబట్టి, మేము గెలిస్తే, బైక్‌పై త్రిబుల్‌ రైడింగ్‌కు అనుమతిస్తాము. లేదంటే, జీపులు, ట్రైన్లకు ఫైన్లు వేస్తాం' అని తెలిపారు.



Next Story

Most Viewed