కొత్త వ్యాక్సిన్లు అందజేయండి: కేంద్రానికి బీహార్ సీఎం విజ్ఞప్తి

by Disha Web Desk 17 |
కొత్త వ్యాక్సిన్లు అందజేయండి: కేంద్రానికి బీహార్ సీఎం విజ్ఞప్తి
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళనల మధ్య బీహార్ సీఎం నితీష్ కుమార్ కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కేంద్రం హోల్డ్‌లో ఉంచిన వ్యాక్సిన్ల కొత్త స్టాక్‌ను అందజేయాలని ఆయన కోరారు. తమ ప్రభుత్వం కరోనా కేసుల పెరుగుదలను పరిశీలిస్తుందని చెప్పారు. అయితే దేశంలో కొన్ని ప్రాంతాల్లోనే కేసుల పెరుగుదల ఉధృతంగా ఉందని, అందులో బీహార్ లేదని చెప్పారు. దేశంలో కంటే తమ రాష్ట్ర పరీక్షల సగటు ఎక్కువ ఉందని చెప్పారు. దేశంలోని పరీక్షల్లో ప్రతి నాలుగింట ఒకటి బీహార్ లో జరగుతుందని తెలిపారు. రాష్ట్రంలో కేసుల తక్కువగా ఉన్నప్పటికీ ఆసుపత్రుల్లో మాస్కుల వాడాలని సూచించినట్లు చెప్పారు. తమ వద్ద ఉన్న వ్యాక్సిన్లను పూర్తయ్యేవరకు ఇస్తామని, కేంద్రం మరిన్ని అందజేయాలని కోరారు.


Next Story

Most Viewed