- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రధాని కావాలనే కాంక్షతోనే విపక్షాలతో పొత్తు: Amit Shah
పాట్నా: కేంద్ర మంత్రి అమిత్ షా బిహార్ సీఎం నితీష్ కుమార్ పై నిప్పులు చెరిగారు. ప్రధాని కావాలనే ఆకాంక్షతో నితీష్ కాంగ్రెస్, ఆర్జేడీలతో పొత్తు కలిపారని ఆరోపించారు. శనివారం బిహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ను తదుపరి ముఖ్యమంత్రిగా చేయడానికి నితీశ్ అధిష్టానం అంగీకరించిందని అన్నారు. ‘జయ్ ప్రకాష్ నారాయణ్ కాలం నుండి, కాంగ్రెస్, 'జంగల్ రాజ్'కు వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాడిన తర్వాత, నితీష్ కుమార్ లాలూ ఆర్జేడీ, సోనియా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు.
ఆ తర్వాత తాను పీఎం కావాలనే ఆశయాలతో అభివృద్ధివాది నుంచి అవకాశవాది అయ్యాడు’ అని విమర్శించారు. గత ఎన్నికల్లో బీహార్లో జేడియూ కన్నా బీజేపీనే ఎక్కువ స్థానాలు గెలిచిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ మరిన్ని స్థానాల్లో గెలవడమే కాకుండా రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే జేడీయూ, ఆర్జేడీ నీరు, నూనె వంటి అపవిత్ర కూటమి అని విమర్శించారు.