- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు నిర్మలా సీతారామన్ లేఖ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు ప్రత్యేకమైన లేఖ రాశారు.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు ప్రత్యేకమైన లేఖ (special letter) రాశారు. అందులో సహకార సమాఖ్యవాద స్ఫూర్తిని నొక్కి చెబుతూ వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) పాలన యొక్క మైలురాయి సవరణను అమలు చేయడంలో వారి మద్దతు, చురుకైన పాత్రకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ లేఖపై ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. పన్ను రేట్లను పునర్వ్యవస్థీకరించే ప్రతిపాదనపై రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. కానీ చివరికి అది సామాన్యుల ప్రయోజనం కోసమేనని అంగీకరించాయి. ఈ వారం ప్రారంభంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం(GST Council meeting)లో ఏకగ్రీవ నిర్ణయానికి రావడానికి ఈ వాదన సహాయపడింది.
సెప్టెంబర్ 22 నుండి వెన్న నుండి చాక్లెట్లు, షాంపూల వరకు ట్రాక్టర్లు, ఎయిర్ కండిషనర్ల వరకు విస్తృత శ్రేణి ఉత్పత్తుల ధరలు తగ్గుతాయని సెప్టెంబర్ 3న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో అంగీకరించారు. ఈ క్రమంలో "నిన్న నేను అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల (Finance Ministers of States)కు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖ రాశాను. వారి తీవ్రమైన చర్చలు వాదనలు చేసినప్పటికి.. కౌన్సిల్ సందర్భానికి తగ్గట్టుగా ముందుకు వచ్చి భారతదేశం ప్రజలందరికీ ఉపశమనం కలిగించింది. ఈ నిర్ణయంలో పాత్రులు అయిన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.






