- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరదల విధ్వంసం.. ప్రధాని మోడీ నివాసంలో ఎన్డీయే ఎంపీల డిన్నర్ రద్దు
ఢిల్లీ, పంజాబ్ సహా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు విధ్వంసం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్డెస్క్: ఢిల్లీ, పంజాబ్ సహా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు విధ్వంసం (Flood destruction) సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ వరదల కారణంగా ఈ నెల 8న ప్రధాని మోడీ నివాసంలో ఎన్డీయే ఎంపీలకు ఇవ్వనున్న విందు కార్యక్రమం రద్దు (Dinner program cancelled) అయింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ నెల 8న ఎన్డీయే కూటమిలోని అన్ని పార్టీల ఎంపీలకు విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే వరదల కారణంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు శనివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో వరదల వల్ల సంభవించిన విధ్వంసం కారణంగా దీన్ని రద్దు చేశారు. అంతకుముందు, శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ఉత్తర భారతదేశం అంతటా భారీ వర్షాలు, మేఘావృతం, వరదల వల్ల సంభవించిన విధ్వంసంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చడంతో రాష్ట్రాల్లో విషాదాన్ని మిగిల్చింది. దేశ ప్రజలు బాధపడుతున్న సమయంలో ఎంపీలు విందులో పాల్గొనడం మంచిది కాదని భావించిన బీజేపీ అధిష్టానం (BJP leadership) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.






