సామాన్యులకు శుభవార్త.. పాల ధరలు తగ్గింపు

by Gantepaka Srikanth |

సామాన్యులకు మదర్ డెయిరీ(Mother Dairy) శుభవార్త చెప్పింది.

సామాన్యులకు శుభవార్త.. పాల ధరలు తగ్గింపు
X

దిశ, వెబ్‌డెస్క్: సామాన్యులకు మదర్ డెయిరీ(Mother Dairy) శుభవార్త చెప్పింది. పాల ధరలు(Milk Prices) తగ్గించింది. లీటర్ పాలపై రూ.2 తగ్గిస్తూ మంగళవారం ప్రకటన చేసింది. అంతేకాదు.. పాల(Milk)తో పాటు టోన్డ్ మిల్క్, పనీర్, బటర్, నెయ్యి, ప్రీమియం ఆవు నెయ్యి వంటి వాటి ధరలు కూడా తగ్గాయి. ఈ తగ్గింపు ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. ప్రొడక్ట్, ప్యాకేజింగ్‌ను బట్టి రూ.2- 30 మధ్య ధరల్ని తగ్గించినట్లు తెలిపింది. లీటర్ మిల్క్ గతంలో రూ.77గా ఉండగా.. ఇప్పుడు రూ.75కు తగ్గింది. డబుల్ టోన్డ్ మిల్క్ (450 ML) ధర రూ. 33 నుంచి రూ. 32కు తగ్గింది. వీటితో పాటు పనీర్, మలాయ్ పనీర్, బటర్ ధరల్ని కూడా మదర్ డెయిరీ తగ్గించింది.

Next Story