కేరళలో మొట్టమొదటి వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ

by Disha Web Desk 12 |
కేరళలో మొట్టమొదటి వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. కేరళలోని తిరువనంతపురంలో మొట్టమొదటి వందే భారత్ రైలుకు జెండా ఊపీ ప్రారంభించారు. కాగా ఈ రైలు తిరువనంతపురం, కాసర్‌గోడ్ మధ్య నడవనుంది. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించబడిన ఈ వందే భారత్ ట్రైన్.. తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిసూర్, పాలక్కాడ్, పతనంతిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్ కాసర్‌గోడ్, మీదుగా మొత్తం 11 జిల్లాలను కవర్ చేస్తుంది. అయితే మొదట్లో, ఈ రైలును తిరువనంతపురం మరియు కన్నూర్ మధ్య నడపాలని అనుకున్నారు. కానీ తిరువనంతపురం, కాసర్‌గోడ్ మధ్య ప్రారంభించారు.



Next Story

Most Viewed