ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థగా భారత్‌ మారుతోంది: ప్రధాని మోడీ

by Ajay Maddhiboyina |

ఐదు దేశాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శ‌నివారం నెద‌ర్లాండ్ లో అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా హేగ్‌లో ప్రవాస భారతీయులను కలిసిన మోడీ.. భారతీయుల స్నేహానికి హేగ్‌ ఒక నిదర్శనం అని వ్యాఖ్యానించారు.

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థగా భారత్‌ మారుతోంది: ప్రధాని మోడీ
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐదు దేశాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శ‌నివారం నెద‌ర్లాండ్ లో అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా హేగ్‌లో ప్రవాస భారతీయులను కలిసిన మోడీ.. భారతీయుల స్నేహానికి హేగ్‌ ఒక నిదర్శనం అని వ్యాఖ్యానించారు. నెదర్లాండ్స్‌ ఆర్థికాభివృద్ధిలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాలం మారినా.. భారతీయ సంస్కృతి మారలేదని అన్నారు. 12 ఏళ్ల క్రితం ఇదే రోజు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి.. ఆ ఎన్నికల్లో NDA ప్రభుత్వం ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు.

కోట్లాది మంది భారతీయుల విశ్వాసం త‌నను వెనకడుగు వేయనివ్వలేదని చెప్పారు. ప్రజల సంతోషమే త‌న సంతోషం అని వ్యాఖ్యానించారు. భారత్‌ పెద్ద పెద్ద కలలు కంటోందని, భారతీయ యువకులు ఆకాశాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. స్టార్టప్‌లు పెడుతున్నారని.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థగా భారత్‌ మారుతోందని వెల్ల‌డించారు. ఇదిలా ఉంటే మోడీ ఈ ప‌ర్య‌ట‌న‌లో ఐదు దేశాల‌తో పలు కీల‌క ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే యూఏఈతో ర‌క్ష‌ణ‌, స‌ముద్ర‌ర‌వాణా, ఇంధ‌న స‌ర‌ఫ‌రా స‌హా ప‌లు ఒప్పందాలు చేసుకున్నారు. నెద‌ర్లాండ్స్ తోనూ ర‌క్ష‌ణ‌, ఏఐ టెక్నాల‌జీతో పాటు ప‌లు ఒప్పందాలు చేసుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Next Story