మిస్సిస్సిప్పిలో టోర్నోడోల బీభత్సం

by Disha Web Desk 16 |
మిస్సిస్సిప్పిలో టోర్నోడోల బీభత్సం
X
  • 23 మంది మృతి
  • వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం

న్యూయార్క్: అమెరికా రాష్ట్రం మిస్సిస్సిప్పిలో టోర్నోడోలు భారీ విషాదాన్ని మిగల్చాయి. భారీ సుడిగాలుల ధాటికి 23 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో వేల సంఖ్యలో చీకటిలో మగ్గుతున్నారని చెప్పారు. టోర్నోడోల ధాటికి అనేక ఇళ్లు ధ్వంసమైనట్లు వెల్లడించారు. షర్కీ కౌంటీ, హంఫ్రే కౌంటీలో 11 మంది మరణించినట్లు తెలిపారు. రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని మిస్సిస్సిప్పి గవర్నర్ టాటే రెవీస్ ప్రకటనలో తెలిపారు. 24 గంటల వ్యవధిలోనే 10కి పైగా టోర్నోడోలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు.


Next Story

Most Viewed