భారత్‌లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-09 14:19:32  IST  )

భారత్‌లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి

భారత్‌లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో భారీ పెట్టుబడికి మైక్రోసాఫ్ట్(Microsoft) కంపెనీ ముందుకొచ్చింది. 17.5 బిలియన్ డాలర్ల(రూ.1.5 లక్షల కోట్లు) పెట్టుబడికి సంసిద్ధత వ్యక్తం చేసింది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi)తో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల(Satya Nadella) భేటీ అయ్యారు. ఈ భేటీలో పెట్టుబడులకు అంగీకారం జరిగింది. ఆసియాలోనే ఇది అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ కావడం విశేషం. ఏఐ రంగంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టనుంది. చర్చల అనంతరం ప్రధాని మోడీకి సత్య నాదెళ్ల కృతజ్ఞతలు తెలిపారు. మోడీతో మీటింగ్ అనంతరం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘దేశ ఆశయాలకు మద్దతు ఇవ్వడానికి, ఇండియా ఏఐ ఫస్ట్ ఫ్యూచర్‌కు అవసరమైన మౌలికసదుపాయాలు, నైపుణ్యాలు, సామర్థ్యాలను నిర్మించడంలో సహాయపడటానికి 17.5 బిలియన్ల పెట్టుబడి నిబద్ధతకు కట్టుబడి ఉన్నాము’’ అని అన్నారు.

Next Story