- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎర్రకోటలో భారీ దొంగతనం
దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ప్రాంగణంలో భారీ దొంగతనం జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ప్రాంగణంలో భారీ దొంగతనం జరిగింది. ఇటీవల జైనుల మతపరమైన కార్యక్రమం 'దశలక్షణ మహాపర్వం' సందర్భంగా దాదాపు కోటి రూపాయల విలువైన బంగారు కలశం దొంగతనం జరిగింది. ఈ కలశం 760 గ్రా. బంగారంతో తయారు చేయబడి, 150 గ్రా. వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలతో పొదిగి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఒక నిందితుడిని గుర్తించారు. కాగా ఈ దొంగతనంతో ఎర్రకోట భద్రతా చర్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Next Story






