కశ్మీర్‌లోని సోనామార్గ్‌లో భారీ హిమపాతం

by S Gopi |
కశ్మీర్‌లోని సోనామార్గ్‌లో భారీ హిమపాతం
X

దిశ, నేషనల్ బ్యూరో: శ్రీనగర్-లేహ్ హైవోలోని సోనామార్గ్ ప్రాంతంలో గురువారం భారీ హిమపాతం సంభవించినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు. సోనామార్గ్‌లోని జోజిలా టన్నెల్ నిర్మాణం వద్ద గల వర్క్‌షాప్‌కు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతానికైతే ఎటువంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఈ నెల ప్రారంభంలోనే భారీ హిమపాతం కారణంగా కశ్మీర్ లోయలోని ఎత్తైన ప్రాంతాలకు అధికారులు హిమపాతం హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 24 గంటల పాటు హిమపాతం సంభవించే ప్రాంతాలవైపు వెళ్లవద్దని ప్రజలకు సూచించారు.

Next Story

Most Viewed