కరోనా అలర్ట్.. వారికి మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం

by Disha Web Desk 12 |
కరోనా అలర్ట్.. వారికి మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పెరుగుదలపై కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శనివారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే వారు మాట్లాడుతూ.. 60 ఏళ్లు పైబడిన వారిలో, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఎక్కువ COVID-19 మరణాలు నమోదవుతున్నాయని చెప్పారు. అలాగే "మేము పరీక్షలను పెంచాము ... ఆసుపత్రిలో అడ్మిషన్ కేసులు కొద్దిగా పెరుగుతున్నాయి. కాబట్టి మేము చెప్పిన విధంగా మాస్క్ ను తప్పనిసరిగా వాడాలని చెప్పుకొచ్చారు.



Next Story