దేశంలో మరో షాకింగ్ ఘటన.. ఢిల్లీలో పట్టాలు తప్పిన రైలు

by Gantepaka Srikanth |

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఘోర రైలు ప్రమాదం(Train Accident) జరిగింది.

దేశంలో మరో షాకింగ్ ఘటన.. ఢిల్లీలో పట్టాలు తప్పిన రైలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఘోర రైలు ప్రమాదం(Train Accident) జరిగింది. ఢిల్లీలోని శివాజీ బ్రిడ్జి స్టేషన్ సమీపంలో హజ్రత్ నిజాముద్దీన్ నుంచి ఘజియాబాద్ వెళ్లే 64419 రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం సమయంలో చోటుచేసుకుంది. ప్రయాణికుల సమాచారంతో విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గుజరాత్‌లోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి.. దాదాపు 242 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కాసేపట్లో ట్రెయిన్ ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది.

Next Story