- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇక కాంగ్రెస్ కన్ను మధ్యప్రదేశ్ పై.. ఉచిత విద్యుత్, మహిళలకు రూ.1,500
by Harish |
కర్ణాటకలో భారీ విజయంతో ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న కాంగ్రెస్ పార్టీ ఇక మధ్యప్రదేశ్ పై కన్నేసింది.

X
ధార్ (మధ్యప్రదేశ్): కర్ణాటకలో భారీ విజయంతో ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న కాంగ్రెస్ పార్టీ ఇక మధ్యప్రదేశ్ పై కన్నేసింది. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కమల్ నాథ్ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు తాయిళాలు కూడా ప్రకటించారు. శుక్రవారం ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారం ఇస్తే 100 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు ఉచిత కరెంటు అందిస్తామన్నారు. 200 యూనిట్లలోపు గృహ వినియోగదారుల నుంచి కరెంటు చార్జీ సగమే వసూలు చేస్తామన్నారు. నిరుపేద మహిళలకు నెలకు రూ.1,500 పింఛను అందిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీంను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
Next Story






