అవినీతి కేసులో ఆర్జేడీ అధినేత లాలూకు ఢిల్లీ కోర్టు సమన్లు..

by Disha Web Desk 13 |
అవినీతి కేసులో ఆర్జేడీ అధినేత లాలూకు ఢిల్లీ కోర్టు సమన్లు..
X

న్యూఢిల్లీ: రైల్వే నియామకాల అవినీతి కేసులో ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్, ఆయన సతీమణి రబ్రీ దేవీ కి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 15న కూతురు మిసా భారతి తో సహా 14 మందిని కోర్టు ముందు కావాలని కోరింది. భారతీయ రైల్వే నియమాకాల్లో ల్యాండ్ ఫర్ జాబ్ పేరుతో అక్రమ నియామకాలకు గానూ అభ్యర్థులను నుంచి భూములను తీసుకుని ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాకుండా ఈ నియామక ప్రక్రియ పారదర్శకంగా లేకపోగా అర్హత లేని వారికి ఉద్యోగాలు అప్పగించినట్లు ఆరోపించింది. ఈ మధ్యనే లాలూ కిడ్నీ మార్పిడి చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయన తాజాగా ఓ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.

Next Story

Most Viewed