BREAKING: RJD ఘోర ఓటమి.. లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె సంచలన ప్రకటన

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-17 06:18:40  IST  )

ఈ ఓటమి తర్వాత RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె, తేజస్వీ యాదవ్ సోదరి రోహిణీ ఆచార్య సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలను పూర్తిగా వీడటంతో పాటు..

BREAKING: RJD ఘోర ఓటమి.. లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్ బంధన్ కూటమి ఘోర పరాజయం పాలైంది. ఈ కూటమిలో ఉన్న RJD 25 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈ ఓటమి తర్వాత RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె, తేజస్వీ యాదవ్ సోదరి రోహిణీ ఆచార్య సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలను పూర్తిగా వీడటంతో పాటు తన కుటుంబంతో కూడా సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించారు.

RJD ఎంపీ, తేజస్వీ యాదవ్ కు సన్నిహితుడైన సంజయ్ యాదవ్, రమీజ్ ల సలహా మేరకు తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు రోహిణీ ఆచార్య తన ఎక్స్ హ్యాండిల్ లో ట్వీట్ చేశారు. వారిద్దరూ తనను ఇలా చేయమని అడిగినట్లు తెలిపారు. RJD ఓటమికి తాను అన్ని నిందలను భరిస్తానని ఆమె వెల్లడించారు.

Click For Twitter Post ..

Next Story