బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక సూత్రధారి అరెస్ట్

by Disha Web Desk 12 |
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక సూత్రధారి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో పురోగతి లభించింది. మూడు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన జాతీయ దర్యాప్తు సంస్థ NIA.. బాంబు బ్లాస్ట్ కు సంబంధించిన కీలక కుట్రదారుడుని అరెస్టు చేసింది. మార్చి 1 న జరిగిన ఈ బ్లాస్ట్ కు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించిన జాతీయ దర్యాప్తు సంస్థ.. ఈ పేలుడు ఘటనలో ముజమ్మిల్ షరీఫ్‌ను సహ-కుట్రదారుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పత్రికా ప్రకటనలో తెలిపింది. అలాగే ఈ కేసులో వీరితో పాటు ఉన్న. మరో ఇద్దరు నిందితులు ముస్సావిర్ షజీబ్ హుస్సేన్, అబ్దుల్ మతీన్ తాహా ఇప్పటికీ పరారీలో ఉన్నారని దర్యాప్తు సంస్థ తెలిపింది.


Next Story

Most Viewed