ప్రధాని పర్యటన డేటా లీక్.. బీజేపీ స్టేట్ ఆఫీస్‌కు బెదిరింపు లేఖ

by Disha Web Desk 2 |
ప్రధాని పర్యటన డేటా లీక్.. బీజేపీ స్టేట్ ఆఫీస్‌కు బెదిరింపు లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ కేరళకు వస్తే ఆత్మాహుతి దాడికి పాల్పడుతామంటూ ఓ బెదిరింపు లేఖ ఆ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి రావడం కలకలం రేపుతోంది. ఎర్నాకులం వాసి జోసెఫ్ జాన్ నడుముత్తమిల్ పేరుతో ఈ లేఖ వచ్చింది. ఏప్రిల్ 24న కేరళలో ప్రధాని మోడీ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో మోడీ కేళల పర్యటనకు వస్తే ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని బెదిరింపు లేఖ రావడం సంచలనంగా మారింది.

నిజానికి వారం రోజుల క్రితమే ఈ లేఖ బీజేపీ ఆఫీస్ కు రాగ ఆ లేఖపై బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లేఖపై రాష్ట్ర పోలీసులు, నిఘా సంస్థలు అప్రమత్తం అయ్యాయి. ఈ సందేశాన్ని పంపించింది ఎవరు? ఎక్కడి నుంచి పంపించారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇదిలాఉంటే మోడీ కేరళ పర్యటనకు సంబంధించి భద్రతా ఉల్లంఘనలు వెలుగులోకి రావటం హాట్ టాపిక్‌గా మారింది. మోడీ కేరళ పర్యటన నిమిత్తం ఏడీజీపీ ఇంటెలిజెన్స్ రూపొందించిన వీవీఐపీల భద్రత వివరాలు లీక్ అయ్యాయి. వాటిని రాష్ట్ర పోలీసుల నుంచే బహిర్గతం అయినట్లు భావిస్తున్నారు. సెక్యూరిటీ ఇన్ ఛార్జ్ అధికారుల వివరాలు సైతం బయటకు పొక్కడంతో ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

Next Story

Most Viewed