ఎర్రకోట పేలుడు.. కీలక నిందితుడు అరెస్ట్

by Muthe.Rajitha |

ఇటీవల ఢిల్లీ ఎర్రకోట వద్ద బాంబు పేలుడు జరిగి 10 మరణించగా.. 32 గాయపడిన సంగతి తెలిసిందే.

ఎర్రకోట పేలుడు.. కీలక నిందితుడు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల ఢిల్లీ ఎర్రకోట వద్ద బాంబు పేలుడు జరిగి 10 మరణించగా.. 32 గాయపడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దాడిలో సూసైడ్ బాంబర్ ఉమర్ నబితోపాటు కుట్ర చేసినట్టు భావిస్తున్న మరో ముఖ్య నిందితుడిని నేడు NIA అరెస్ట్ చేసినట్టు ప్రకటించింది. ఈ ఘటన అనంతరం కేంద్ర హోమ్ శాఖ ఈ కేసును NIA కి అప్పగించగా.. నిందితుల కోసం తీవ్ర గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో ఆదివారం కశ్మీర్ వాసి రషీద్ అలీని పోలీసులు అరెస్ట్ చేసారు.

ఆత్మహుతికి ప్లాన్ చేసిన వారిలో ఉమర్ తోపాటు రషీద్ ఉన్నట్టు తెలిపింది. కారును కొనుగోలు చేసి, అందులో IED అమర్చినట్టు తెలిపారు. ఇక ఈ ఘటనతో సంబంధం ఉన్నట్టు అభిప్రాయపడుతున్న మరో 15 మంది వైద్యులు పేలుడు జరిగిన నాటి నుంచి కనబడకుండా పోయారు.

Next Story