కేరళ రైలు ప్రయాణికులకు నిప్పు పెట్టింది ఇతనే..

by Disha Web Desk 12 |
కేరళ రైలు ప్రయాణికులకు నిప్పు పెట్టింది ఇతనే..
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్‌లో తన సహ ప్రయాణికుడిని తగులబెట్టినట్లు అనుమానిస్తున్న వ్యక్తి యొక్క స్కెచ్‌ను పోలీసులు విడుదల చేశారు. ప్రమాద ప్రదేశంలో అనుమానిత బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ కేసులో ఉగ్రవాద కోణంలో విచారణ చేపట్టారు. కాగా ఈ ఘటనలో నిందితుడు నిప్పుపెట్టగా భయంతో రైలు నుంచి దూకి బాధితులలో రెండేళ్ల చిన్నారి సహా.. ముగ్గురు మృతి చెందారు. అలాగే మట్టలు తట్టుకోలేకే పట్టాలపై దూకడంతో మరో ఎనిమిది మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. అలాగే ప్రత్యక్ష సాక్షుల సహాయంతో నిందితుని స్కెచ్ గీయించిన పోలీసులు దాని ఆధారంగా అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసి నిందితుని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed